KIND ATTENTION - ALL BLOGGERS

DEAR FRIENDS, FROM 4.3.10 NIGHT, SOMEONE(SCOTLAND ADDRESS)HACKED MY E-MAIL gavinivn@gmail.com AND BEEN MIS-USING FOR WRONGFUL FINANCIAL GAIN. PLEASE DO NOT BELIEVE ANY STORY FROM THIS E-MAIL, IMPERSONATED BY HACKER IN THE NAME, GAVINI VENKATA NARAYANA, SEEKING FOR ANY HELP FINANCIAL OR OTHERWISE. THANKS.

Monday, December 20, 2010

మంత్రుల పరిశీలన తర్వాతే నివేదిక అంశాలు బహిర్గతం!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులపై జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించే నివేదికను పరిశీలించేందుకు ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కేంద్రంలోని యూపీఏ భాగస్వామ్య పార్టీలోని సీనియర్ మంత్రులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ మంత్రుల బృందం నివేదికపై పూర్తిగా పరిశీలించిన తర్వాతే నివేదికలోని అంశాలను నోడెల్ అధికారి ద్వారా బహిర్గతం చేయనున్నారు.  శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని అంశాలను ఏకపక్షంగా బహిర్గతం చేస్తే యూపీఏ ప్రభుత్వానికి చిక్కులు తప్పవని కేంద్ర మంత్రులు మమతా బెనర్జీ, శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని యోచనలో పడ్డారు.

ఇదిలావుండగా, ఆంధ్రప్రదేశ్ మీడియాకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో కేంద్ర సమాచార శాఖ మంత్రి అంబికాసోని బుధవారం హోంమంత్రి చిదంబరంతో సమావేశం అయ్యారు. ఈ భేటీ అనంతరం అంబికాసోని మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మీడియా సంయమనంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్వేగాలు పెరిగేలా కథనాలు ప్రసారం చేయవద్దని కోరారు. ఊహాగానాలు, కథనాలు ప్రసారం చేయవద్దని మీడియాను ఆమె విజ్ఞప్తి చేశారు. ఎన్.బి.ఏ పరిధిలును ఉల్లంఘించరాదని సూచించింది. అధికారికంగా ధ్రువీకరించిన తర్వాతే ఏవార్త అయినా ప్రసారం చేయాలని హితవు పలికారు. రాష్ట్ర మీడియాను ఎప్పటికప్పుడూ నిశితంగా గమనిస్తుంటామని ఆమె తెలిపారు.
(source=MSN News)

No comments:

Post a Comment