KIND ATTENTION - ALL BLOGGERS

DEAR FRIENDS, FROM 4.3.10 NIGHT, SOMEONE(SCOTLAND ADDRESS)HACKED MY E-MAIL gavinivn@gmail.com AND BEEN MIS-USING FOR WRONGFUL FINANCIAL GAIN. PLEASE DO NOT BELIEVE ANY STORY FROM THIS E-MAIL, IMPERSONATED BY HACKER IN THE NAME, GAVINI VENKATA NARAYANA, SEEKING FOR ANY HELP FINANCIAL OR OTHERWISE. THANKS.

Thursday, December 30, 2010

ఆ 8 పార్టీల ముందే జనవరి 6న కమిటీ నివేదిక విప్పుతాం

గురువారం, 30 డిసెంబర్ 2010( 15:22 IST )- జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ సమర్పించిన నివేదికపై కొత్త సంవత్సరంలో కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటన చేయనున్నారు. జనవరి ఆరో తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి నివేదికలోని సారాంశాన్ని బహిర్గతం చేస్తామని పి. చిదంబరం ప్రకటించారు. గుర్తింపు పొందిన ఎనిమిది పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఉంటుందని పీసీ గురువారం వెల్లడించారు. కమిటీ నివేదిక ప్రకటన ఎలా ఉన్నా రాష్ట్ర ప్రజలు సంయమనం పాటించాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు.

కాగా.. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని అంశాన్ని బయటపెట్టడంపై కేంద్రం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే మీడియాపై ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం సున్నితమైన ఈ అంశాన్ని అఖిలపక్ష భేటీలో బహిర్గతం చేయనుంది. మరోవైపు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్ర నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం మంత్రులకు సూచించారు. నివేదికపై మీడియా ముందు నోరు విప్పొద్దని, సంయమనం పాటించాలని ఆయన మంత్రులను కోరారు.
================================
(source-MSN News)

No comments:

Post a Comment