KIND ATTENTION - ALL BLOGGERS

DEAR FRIENDS, FROM 4.3.10 NIGHT, SOMEONE(SCOTLAND ADDRESS)HACKED MY E-MAIL gavinivn@gmail.com AND BEEN MIS-USING FOR WRONGFUL FINANCIAL GAIN. PLEASE DO NOT BELIEVE ANY STORY FROM THIS E-MAIL, IMPERSONATED BY HACKER IN THE NAME, GAVINI VENKATA NARAYANA, SEEKING FOR ANY HELP FINANCIAL OR OTHERWISE. THANKS.

Tuesday, December 28, 2010

ఎక్కువ మంది ప్రజలను సంతృప్తి పరిచేలా నివేదిక: శ్రీకృష్ణ

 మంగళవారం, 28 డిసెంబర్ 2010( 18:56 IST )


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులపై తాము చేసిన అధ్యయనంలో తాము సేకరించిన అంశాలను క్రోఢీకరించి ఎక్కువ మంది ప్రజలు సంతృప్తిచెందేలా నివేదికను తయారు చేశామని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఛైర్మన్ జస్టీ శ్రీకృష్ణ తెలిపారు. ఈ కమిటీ సభ్యులు మంగళవారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తమ నివేదిక అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు. తమ 11 నెలల విస్తృత అధ్యయనంలో కమిటీకి సహకరించిన మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర విభజన అంశంపై తాము చేసే సూచనలు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తాయన్నారు. నివేదికను రూపొందించడం ప్రసవవేదనలా ఉంటుందన్నారు. పుట్టేది ఆడపిల్లా? మగపిల్లవాడా? అనే విషయం తెలుసుకోవాలని సహజంగానే అందరికీ ఆతృత ఉంటుందన్నారు. నివేదికలోని అంశాల గురించి ఆరాతీయడానికి ప్రయత్నించవద్దని ఆయన మీడియాకు ముందుగానే విజ్ఞప్తి చేశారు.
నివేదికలో పేర్కొన్న అంశాలను కేంద్రమే వెల్లడిస్తుందని, ఇందుకోసం మరో నాలుగైదు రోజులు వేచి ఉండాలన్నారు. తాము ముందుగా ప్రకటించినట్టుగానే గడువులోగానే అంటే డిసెంబరు 31వ తేదీన తుది నివేదికను కేంద్ర హోంమంత్రి చిదంబరానికి సమర్పించనున్నట్టు తెలిపారు. ఈ నివేదికను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న అన్ని అంశాలను పరిశీలించినట్లు శ్రీకృష్ణ తెలిపారు. అయితే, శాంతిభద్రత పరిరక్షణ బాధ్యత మాత్రం రాజకీయనేతలపైనే ఉందన్నారు. నివేదిక అనుకూలంగా ఉన్నా.. వ్యతిరేకంగా ఉన్నా శాంతిభద్రతలను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారని, దీనికి కట్టుబడి ఉండాలని కమిటీ సభ్యులు కోరారు. నివేదిక సమర్పించిన తరువాత ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉండదన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు.  ఇకపోతే.. కమిటీ సభ్య కార్యదర్శి వీకే.దుగ్గల్ మాట్లాడుతూ.. తమ కమిటీ చేసిన సిఫారసులు నిష్పక్ష పాతంగా ఉంటాయన్నారు. నివేదికను రెండు భాగాలుగా ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. నివేదిక భారీగా ఉంటుందని ఆయన తెలిపారు. నివేదిక రూపొందించడం కోసం తాము అన్ని జిల్లాలు తిరిగామని చెప్పారు. ప్రతి అంశాన్ని తూలనాత్మకంగా పరిశీలించినట్లు తెలిపారు.
===================================
కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా కళ్ళుతెరవడం సంతోషం: కేసీఆర్


తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరిచినందుకు చాలా సంతోషంగా ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు అన్నారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని కోరుతూ ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు చేపట్టిన దీక్ష నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేదిగా ఉందన్నారు. ఆయన మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల దీక్షా శిబిరాన్ని సందర్శించి తన మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తూ ఇప్పటికైనా తెలంగాణ నేతలు కళ్లు తెరిచినందుకు సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల అభిష్టానానికి వ్యతిరేకంగా జరిగిందే పెద్దమనుషుల ఒప్పందం అని విమర్శించారు. సీమాంధ్ర పాలకులు పెద్ద మనుషుల ఒప్పందాన్ని పూర్తిగా తుంగలోతొక్కారన్నారు.
దీక్ష చేపట్టిన ఎంపీల వెనుక నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉన్నారన్నారు. వీరు ఒంటరివారు కాదన్నారు. తెలంగాణ ఎంపీలు దీక్షలో కూర్చుంటే అది అధిష్టానాన్ని ధిక్కరించినట్లా అని కేసీఆర్ ప్రశ్నించారు. విజయవాడలో వైఎస్.జగన్ చేపట్టిన లక్ష్యదీక్షలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లి బాహాటంగా మద్దతు తెలిపితే అది ఉల్లంఘన కాదా అని అడిగారు. ఇప్పటికైనా నిజం తెలుసుకుని పోరుకు కాంగ్రెస్‌ ఎంపీలు ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని, తెలంగాణ ప్రజానీకానికి ఎంతో ధైర్యం వచ్చినట్టుగా ఉందన్నారు. తెలంగాణ ఎంపీలందరూ కలిసి కట్టుగా అడిగినా సీఎం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. పైగా పార్టీ దిక్కారమనటం మరి విడ్డూరంగా ఉందన్నారు.
===============================
విద్యార్థులపై కేసుల ఎత్తివేత: హోం మంత్రి సబితా ప్రకటన

ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో విద్యార్ధులపై పెట్టిన అన్ని కేసులను ఎత్తివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అన్ని కేసులను ఒకేసారి ఎత్తివేయడం సాధ్యంకాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. న్యాయపరమైన చిక్కుముడులు ఉన్న కేసులను కోర్టుకు నివేదించిన తర్వాతే ఈ కేసులను ఎత్తివేస్తామని రాష్ట్ర హోంశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ప్రకటించారు. ఇందులోభాగంగా మొత్తం కేసులు 1,667 ఉండగా, ఇప్పటివరకు 95 కేసుల్లో 729 మందికి విముక్తి కలిగిందన్నారు. తొలివిడతగా మరో 700 కేసుల్లో 3,300 మందికి విముక్తి కలిగించనున్నట్టు ఆమె తెలిపారు. సీఆర్‌పీసీ 321 కింద నమోదైన కేసులను కోర్టుకు నివేదించి తొలగించడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆమె వివరించారు. అంతకముందు విద్యార్థులపై కేసుల ఎత్తివేయాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల దీక్షకు దిగిన విషయం తెల్సిందే. దీంతో ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ మంత్రులు ముఖ్యమంత్రితో జరిపిన దౌత్యం ఫలించింది. ఎట్టకేలకు ప్రభుత్వం విద్యార్ధులపై పెట్టిన అన్ని కేసులు ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకుంది.

సీఎంతో భేటీ అయిన వారిలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జనారెడ్డి, బస్వరాజు సారయ్య, శ్రీధర్‌బాబు, సునీతారెడ్డి, పలువురుతో సహా పలుపులు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు చేసిన వాదనను ప్రభుత్వం నిర్ధ్వద్వందంగా తోసిపుచ్చింది.
=================================
 (source- MSN News)

No comments:

Post a Comment