KIND ATTENTION - ALL BLOGGERS

DEAR FRIENDS, FROM 4.3.10 NIGHT, SOMEONE(SCOTLAND ADDRESS)HACKED MY E-MAIL gavinivn@gmail.com AND BEEN MIS-USING FOR WRONGFUL FINANCIAL GAIN. PLEASE DO NOT BELIEVE ANY STORY FROM THIS E-MAIL, IMPERSONATED BY HACKER IN THE NAME, GAVINI VENKATA NARAYANA, SEEKING FOR ANY HELP FINANCIAL OR OTHERWISE. THANKS.

Thursday, December 30, 2010

మా నివేదిక గురించి తెలుసుకోవాలంటే 6 రోజులు ఆగండి!

కేంద్ర హోం మంత్రి పి. చిదంబరంకు 600 పేజీలతో కూడిన నివేదికను సమర్పించడం జరిగిందని జస్టీస్ శ్రీకృష్ణ గురువారం మీడియాతో ప్రకటించారు. రాష్ట్రంలోని పలు అంశాలపై 11 నెలల పాటు అధ్యయనం చేసి తాము సమర్పించిన నివేదికపై కేంద్ర హోం మంత్రి ఆరో తేదీన ప్రకటన చేస్తారని కృష్ణ తెలిపారు. తాము సమర్పించిన నివేదికలోని సారాంశాన్ని తెలుసుకోవాలంటే జనవరి ఆరో తేదీ దాకా ఆగాల్సిందేనని కృష్ణ వెల్లడించారు. జనవరి ఆరో తేదీన 8 గుర్తింపు పొందిన పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారని, అఖిలపక్ష నేతలతో చర్చలు జరిపిన తర్వాత ఆ రోజు సాయంత్రం శ్రీకృష్ణ కమిటీ నివేదికను కేంద్ర హోం మంత్రి బహిర్గతం చేస్తారని కృష్ణ తెలిపారు. అలాగే అన్ని అంశాలు తమ నివేదికలో ఉంటాయని వీకే దుగ్గల్ మీడియాతో అన్నారు.

మరోవైపు శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన నివేదికలోని సారాంశాన్ని బహిర్గతం చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తోంది. ఆరో తేదీన జరిగే అఖిలపక్షంలో ఈ అంశంపై చర్చించి, నివేదిక ప్రకటనకు అనంతరం తీసుకునే రాజకీయ నిర్ణయాలు, శాంతి భద్రతలపై దృష్టి సారించింది. ఎలాంటి పరిస్థితి తెలెత్తినా రాష్ట్రంలో శాంతి భద్రతలకు భగ్నం వాటిల్లకుండా అనేక చర్యలు తీసుకునేందుకు కేంద్ర ఇప్పటికే ఐదు వేల పారా మిలటరీ బలగాలను సిద్ధంగా ఉంచామని చిదంబరం తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు రాష్ట్ర ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని పి. చిదంబరం అన్నారు. అలాగే ఊహాజనిత వార్తలు ప్రసారం చేయవద్దని కేంద్ర మంత్రి మీడియాకు హితవు పలికారు.

No comments:

Post a Comment