KIND ATTENTION - ALL BLOGGERS

DEAR FRIENDS, FROM 4.3.10 NIGHT, SOMEONE(SCOTLAND ADDRESS)HACKED MY E-MAIL gavinivn@gmail.com AND BEEN MIS-USING FOR WRONGFUL FINANCIAL GAIN. PLEASE DO NOT BELIEVE ANY STORY FROM THIS E-MAIL, IMPERSONATED BY HACKER IN THE NAME, GAVINI VENKATA NARAYANA, SEEKING FOR ANY HELP FINANCIAL OR OTHERWISE. THANKS.

Sunday, December 19, 2010

తెలంగాణ రాష్ట్రం రాదని తెలంగాణ నేతలకు తెలిసిందా??

ఆదివారం, 19 డిసెంబర్ 2010( 11:49 IST )


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదని ఆ ప్రాంతానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నేతలకు ఏదైనా సమాచారం అందిందా? జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ రాష్ట్ర పర్యటనకు వచ్చి వెళ్లినప్పటి నుంచి తెలంగాణ నేతలు చేస్తున్న ప్రకటనలే ఇందుకు ఊతమిస్తున్నాయి. పైపెచ్చు.. రాష్ట్రానికి యాభై కంపెనీల అదనపు బలగాలను కేంద్రం పంపించింది. దీంతో పాటు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై డీజీపీ అరవిందరావు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలావుండగా, శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ తెలంగాణ సీనియర్ నేత కె.కేశవ రావు.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏవిధంగానైనా ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. జస్టీస్ శ్రీకృష్ణ నీతులు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను నివేదికలో పొందుపరచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్ర నేతలు, పారిశ్రామికవేత్తలు సహకరించాలని ఆయన కోరారు.

అదేవిధంగా శనివారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎంపీలు ఢిల్లీలో కేకే నివాసంలో భేటీ అయ్యారు. వారు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. గత డిసెంబరు తొమ్మిదో తేదీ ప్రకటనకు కట్టుబడి ఉండాలని, తెలంగాణను ఏదో ఒక రూపంలో వచ్చేలా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే అంశంపై ఆమెను కలిసి వినతి పత్రం సమర్పించనున్నట్టు వెల్లడించారు. 

మరోవైపు.. తెలంగాణ ఉద్యమ హీరో తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావుతో సహా ఆయన అనుచరగణం రెచ్చగొట్టే మాటలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణను ఇవ్వకుంటే తమ పని తాము చేస్తామని ప్రకటించారు. శాంతిభద్రతల పరిరక్షణ పోలీసుల కర్తవ్యమని, లక్ష్య సాధన కోసం ఉద్యమాలు చేయడం ఉద్యమకారుల బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు.  తెలంగాణ ఇవ్వకుంటే కృత్రిమ భూకంపం సృష్టిస్తామన్నారు. అలాగే, బ్రహ్మాండం బద్ధలుకొట్టైనా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటామని ప్రకటించారు. ఇవ్వన్నీ చూస్తుంటే తెలంగాణ నేతలకు సూచాయగా రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఏదైనా సంకేతాలు అందాయా అనే సందేహం కలుగుతోంది. మరోవైపు జస్టీస్ శ్రీకృష్ణ సమర్పించనున్న నివేదికతో పాటు.. రాష్ట్ర విభజనపై మాత్రం సీమాంధ్ర నేతలు నోరు మెదపక పోవడం కూడా పలు అనుమానాలకు దారితీస్తోంది.
======================================
(source-MSN News)

No comments:

Post a Comment