KIND ATTENTION - ALL BLOGGERS

DEAR FRIENDS, FROM 4.3.10 NIGHT, SOMEONE(SCOTLAND ADDRESS)HACKED MY E-MAIL gavinivn@gmail.com AND BEEN MIS-USING FOR WRONGFUL FINANCIAL GAIN. PLEASE DO NOT BELIEVE ANY STORY FROM THIS E-MAIL, IMPERSONATED BY HACKER IN THE NAME, GAVINI VENKATA NARAYANA, SEEKING FOR ANY HELP FINANCIAL OR OTHERWISE. THANKS.

Monday, October 10, 2011

'ఆరేళ్లుగా ఎందుకు సంప్రదింపులు చేయలేదు'

హైదరాబాద్ : తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఆరేళ్లుగా ఎందుకు సంప్రదింపుల ప్రక్రియ చేపట్టలేదని బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. కేంద్రం తక్షణమే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వెంకయ్యనాయుడు సోమవారం పార్టీ కార్యాలయంలో అద్వానీ రథయాత్ర పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కాంగ్రెస్ పాలన రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందన్నారు.

ప్రస్తుత పరిస్థితులు రాష్ట్రపతి పాలనకు అనుకూలంగా ఉన్నాయని... అయితే రాష్ట్రపతి పాలనకు స్వతహాగా బీజేపీ వ్యతిరేకమని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలతో వ్యవసాయం కుంటుపడుతుందన్నారు. మంత్రులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నా పట్టించుకునే వారే లేరన్నారు. మంత్రివర్గం కూడా సమావేశం కాలేని పరిస్థితి నెలకొని ఉందన్నారు

సాయంత్రం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ : కాంగ్రెస్ కోర్ కమిటీ ఈ రోజు సాయంత్రం సమావేశం కానుంది. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ప్రధానమంత్రికి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ అంశంపై నివేదిక సమర్పించనున్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ అధిష్టానం చేపట్టిన ‘విస్తృత సంప్రదింపుల’ ప్రక్రియలో భాగంగా తదుపరి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ అంశంపై ఒకట్రెండు రోజుల్లోనే ఒక స్పష్టత ఇవ్వటం ద్వారా దీనికి అధిష్టానం తెరదించుతున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి.

(Source-saakshi)

No comments:

Post a Comment