KIND ATTENTION - ALL BLOGGERS

DEAR FRIENDS, FROM 4.3.10 NIGHT, SOMEONE(SCOTLAND ADDRESS)HACKED MY E-MAIL gavinivn@gmail.com AND BEEN MIS-USING FOR WRONGFUL FINANCIAL GAIN. PLEASE DO NOT BELIEVE ANY STORY FROM THIS E-MAIL, IMPERSONATED BY HACKER IN THE NAME, GAVINI VENKATA NARAYANA, SEEKING FOR ANY HELP FINANCIAL OR OTHERWISE. THANKS.

Tuesday, January 11, 2011

లాగులు ఊడగొట్టి పంపించే రోజు దగ్గర్లోనే ఉంది: తెరాస

తెలంగాణ ప్రాంతంలోని సమైక్యవాదుల లాగులు ఊడగొట్టి తరిమే సమయం అతి దగ్గర్లోనే ఉందని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నేతలు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మరుక్షణం ఇది జరుగుతుందని ఆ పార్టీ సీనియర్ నేతలు నాయిని నర్శింహా రెడ్డి, చంద్రశేఖర్ జోస్యం చెప్పారు. అంతేకాకుండా, రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోందని వారు ఆరోపించారు. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ల ముట్టడి జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నేత నాయిని నర్సింసింహా రెడ్డి, చంద్రశేఖర్‌లు ప్రసంగిస్తూ తెలంగాణలోని పోలీసు బలగాలను చూస్తుంటే రాష్ట్రపతి పాలనను తలపిస్తోందన్నారు. అందువల్ల కొత్తగా రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారని గుర్తు చేశారు.

రాష్ట్ర పాలనా పగ్గాలు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి చేతిలో లేవని గవర్నర్ నరసింహన్ వద్ద ఉన్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ తీరు తెలంగాణకు అవమానంగా ఉందన్నారు. అనంతరం తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ఇప్పటికైనా వారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించాలన్నారు. కాంగ్రెస్, తెదేపాలు తెలంగాణపై తమ పార్టీ వైఖరిని స్పష్టం చేయాలన్నారు.  శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి మెత్తబడిందన్న వార్తలను మాజీ మంత్రి, తెరాస సీనియర్ నేత సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ తోసిపుచ్చారు. సమైక్యవాదుల లాగులు ఊడగొట్టి వారిని పంపించే రోజు అతి దగ్గర్లోనే ఉందన్నారు. తెలంగాణ తెలుగుదేశం నేతలుకు సిగ్గు ఉంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఉద్యమించాలన్నారు.
===============================
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్తి మద్దతు: చంద్రబాబు


ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీసుకునే అన్ని రకాల చర్యలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆయన ఆదివారం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలతో తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన తుది నివేదికపై కేంద్రమే చర్య తీసుకోవాలన్నారు. అణు ఒప్పందం బిల్లును ప్రతిపక్ష పార్టీలతో పాటు యూపీఏలోని కీలక భాగస్వామ్యమైన వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించినా బిల్లును పార్లమెంట్‌లో కాంగ్రెస్ ప్రవేశపెట్టిందని ఆయన గుర్తు చేశారు. అలాగే, రాష్ట్రంలో శాసనమండలి వద్దని తాము అడ్డంపడినా వైఎస్ఆర్ సర్కార్ శాసనమండలిని పునరుద్ధరింపజేసిందన్నారు.

అణు బిల్లు, శాసనమండలి పునరుద్ధరణ అంశాల్లో కాంగ్రెస్ తన పంతం నెగ్గించుకోగా ఇపుడు తెలంగాణపై ఎందుకు ఇతర పార్టీల అభిప్రాయం కోసం వేచి చూస్తోందన్నారు. ఇకపోతే. ఉస్మానియా విద్యార్థులపై పోలీసుల చేసిన లాఠీ ఛార్జిని చంద్రబాబు ఖండించారు.  రాష్ట్రంలో ఉద్యమాల సందర్భంగా విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని విధాన సభలో తెదేపా డిమాండ్‌ చేసినా పట్టించుకోని ప్రభుత్వం కాంగ్రెస్‌ ఎంపీలు దీక్షకు దిగిన ఒక్క రోజుకే కేసులన్నీ ఎత్తివేసిందని చంద్రబాబు గుర్తు చేశారు. అందువల్ల తెలంగాణపై కేంద్రమే తుది నిర్ణయం తీసుకోవాలన్నారు.
=========================
(source-MSN News)

No comments:

Post a Comment