KIND ATTENTION - ALL BLOGGERS

DEAR FRIENDS, FROM 4.3.10 NIGHT, SOMEONE(SCOTLAND ADDRESS)HACKED MY E-MAIL gavinivn@gmail.com AND BEEN MIS-USING FOR WRONGFUL FINANCIAL GAIN. PLEASE DO NOT BELIEVE ANY STORY FROM THIS E-MAIL, IMPERSONATED BY HACKER IN THE NAME, GAVINI VENKATA NARAYANA, SEEKING FOR ANY HELP FINANCIAL OR OTHERWISE. THANKS.

Thursday, January 6, 2011

ఆరు సూచనలు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక!!

జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక బహిర్గతమైంది. కేంద్రం హోం మంత్రి చిదంబరం అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు జరిగిన అఖిలపక్ష సమావేశంలో నివేదికలోని అంశాలు బహిర్గతమయ్యాయి. ఈ నివేదికలో జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సభ్యులు ఆరు ప్రధాన సూచనలు చేసినట్టు ఎలక్ట్రానిక్ మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది. నివేదిక ప్రతిపాదించిన ఆరు సూచనలు :

1వ సూచన:- రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచటం. తెలంగాణ అభివృద్ధి కోసం మూడు ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేయటం.

2వ సూచన:- తెలంగాణ ,ఆంధ్ర రాష్ట్రాలుగా విభజన (1956 ముందు పరిస్థితి పునరుద్దరణ).

3వ సూచన:- హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలతో కలిపి కేంద్ర పాలిత ప్రాంతంగా చేయటం, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించడం.

4వ సూచన:- తెలంగాణ, రాయలసీమను కలిపి రాయల తెలంగాణగా ఒక రాష్ట్రం, కోస్తాంధ్ర ప్రాంతాలన్నింటినీ కలిపి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేయడం.

5వ సూచన:- రాష్ట్రాన్ని ఉన్నది ఉన్నట్లుగా కొనసాగించటం.

6వ సూచన:- ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పాటు చేయటం.
===============================================
బుద్ధుడి ప్రవచనంతో జస్టీస్ శ్రీకృష్ణ నివేదిక తయారు!!

జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక బహిర్గతమైంది. ఈ నివేదికను 1960 సంవత్సరం అక్టోబరు మూడో తేదీన ఐక్యరాజ్యసమితిలో దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన ప్రసంగంలో ఉటంకించిన బుద్ధుని ప్రవచనాలతో నివేదికను రెండు సంపుటాలలో రూపొందించారు. మొత్తం 505 పేజీలతో కూడిన తొలి సంపుటిలో మొత్తం తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కో అధ్యాయంలో ఒక్కో అంశాన్ని విపులీకరించారు. రెండో సంపుటి 108 పేజీలతో ఉంది. ఇందులో మరికొన్ని అంశాలను విపులీకరించారు.

శ్రీ కృష్ణ కమిటీ నివేదికలో పేర్కొన్న తొమ్మిది అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలో రాష్ట్రంలో పరిణామాలు, చారిత్రక దృక్ఫథం వంటి అంశాలను వివరించారు. అలాగే, అధ్యాయం-2లో ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి, సమతుల్యత విశ్లేషణను విశ్లేషించారు. అధ్యాయం-3లో విద్య - వైద్యం రంగాలను వివరించగా, అధ్యాయం-4లో నీటి వనరులు, సాగునీటి, విద్యుత్ అభివృద్ధి అంశాలను పేర్కొన్నారు. ఇకపోతే.. ఐదో అధ్యాయంలో ప్రజలు- ఉద్యోగ అంశాలు, అద్యాయం ఆరులో హైదరాబాద్ మహానగరం, ఏడో అధ్యాయంలో సామాజిక సాంస్కృతిక అంశాలు, ఎనిమిదో అధ్యాయంలో రాష్ట్ర శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, తొమ్మిదో అధ్యాయంలో భవిష్యత్ సూచలను వివరిస్తూ నివేదికను రూపొందించారు.
====================================
(సోర్సు-MSN న్యూస్)

1 comment: