KIND ATTENTION - ALL BLOGGERS

DEAR FRIENDS, FROM 4.3.10 NIGHT, SOMEONE(SCOTLAND ADDRESS)HACKED MY E-MAIL gavinivn@gmail.com AND BEEN MIS-USING FOR WRONGFUL FINANCIAL GAIN. PLEASE DO NOT BELIEVE ANY STORY FROM THIS E-MAIL, IMPERSONATED BY HACKER IN THE NAME, GAVINI VENKATA NARAYANA, SEEKING FOR ANY HELP FINANCIAL OR OTHERWISE. THANKS.

Wednesday, April 28, 2010

జస్టీస్ శ్రీకృష్ణ బృందానిదీ తెలంగాణనమే: జయశంకర్

జస్టీస్ శ్రీకృష్ణ బృందం కూడా తెలంగాణ నినాదమే ఆలపించబోతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జోస్యం చెప్పారు. అంతేకాకుండా, తుది నివేదిక ఇచ్చే అంశంపై ఆ కమిటీపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. బుధవారం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులపై ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. వారు నిష్పక్షిపాతంగా నివేదిక ఇస్తారనే నమ్మకం తమకుందన్నారు. పార్టీ పదేళ్ల చరిత్రను ఆయన ఈ సందర్భంగా సభికులకు వివరించారు.

గత తొమ్మిది సంవత్సరాల కాలంలో తెలంగాణ ఉద్యమానికి విరామం వచ్చిందేమోగాని విరమణ మాత్రం రాలేదని ఆయన చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణ కోసం కేసీఆర్‌ నేతృత్వంలోని తెరాస శ్రేణులు నిరాటంకంగా పోరాటం చేస్తూనే ఉన్నారన్నారు. గత యాభై సంవత్సరాల కాలంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై నిజాయితీతో నివేదిక సమర్పించిన పార్టీ ఒక్క తెరాస మాత్రమేనన్నారు. తెరాస తరపున తాము వినిపించిన వాదనలు విని శ్రీకృష్ణ కమిటీ సభ్యులు నివ్వెర పోయారన్నారు. అందుకే కమిటీ సభ్యులపై తమకెలాంటి సందేహం లేదన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వంపై తమకు అనేక అనుమానాలు ఉన్నట్టు జయశంకర్ తెలిపారు
(MSN news)

No comments:

Post a Comment