KIND ATTENTION - ALL BLOGGERS

DEAR FRIENDS, FROM 4.3.10 NIGHT, SOMEONE(SCOTLAND ADDRESS)HACKED MY E-MAIL gavinivn@gmail.com AND BEEN MIS-USING FOR WRONGFUL FINANCIAL GAIN. PLEASE DO NOT BELIEVE ANY STORY FROM THIS E-MAIL, IMPERSONATED BY HACKER IN THE NAME, GAVINI VENKATA NARAYANA, SEEKING FOR ANY HELP FINANCIAL OR OTHERWISE. THANKS.

Tuesday, July 19, 2011

తెలంగాణ అత్యంత సున్నితమైన అంశం: మన్మోహన్

 మంగళవారం, 19 జులై 2011( 12:29 IST )తెలంగాణ అంశం అత్యంత సున్నితమైన అంశమని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. అలాగే రాష్ట్ర విభజన అంశంపై సీమాంధ్ర ప్రాంత ప్రతినిధులు అందించిన సమాచారాన్ని కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులకు వివరిస్తానని మంగళవారం ఆయనను కలిసిన సీమాంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిధులకు ప్రధాని హామీ ఇచ్చారు.  మంగళవారం ఉదయం సీమాంధ్రనేతలతో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ.. తెలంగాణ సమస్య అతి సున్నితమైందని, ఆచూతూచీ వ్యవహరించా లని ఆయన సూచించారు. తెలంగాణ సమస్యపై పార్టీ కోర్‌కమిటీలో చర్చిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు.

ఇదే అంశంపై సమైక్యాంధ్ర కాంగ్రెస్ ఫోరం కన్వీనర్ ఎన్.శైలజానాథ్ మాట్లాడుతూ.. సమైక్యాంధ్రతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని తాము ప్రధానికి వివరించామన్నారు. తెలంగాణ వారు చేస్తున్న రాజకీయ డ్రామాలపై ఆయనకు వివరించామన్నారు. శ్రీకృష్ణ కమిటీలోని మంచి ప్రతిపాదనలను అమలు చేయాలని తాము కోరామన్నారు.
====================
(SOURCE - MSN WEBDUNIA)

No comments:

Post a Comment