KIND ATTENTION - ALL BLOGGERS

DEAR FRIENDS, FROM 4.3.10 NIGHT, SOMEONE(SCOTLAND ADDRESS)HACKED MY E-MAIL gavinivn@gmail.com AND BEEN MIS-USING FOR WRONGFUL FINANCIAL GAIN. PLEASE DO NOT BELIEVE ANY STORY FROM THIS E-MAIL, IMPERSONATED BY HACKER IN THE NAME, GAVINI VENKATA NARAYANA, SEEKING FOR ANY HELP FINANCIAL OR OTHERWISE. THANKS.

Tuesday, April 29, 2014

న్యాయాన్యాయాలు - నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

2013

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర్పడగా నే మొదట దెబ్బతిన్నది పోచంపాడు ప్రాజెక్టు. రాష్ట్రానికి ఒక భారీ ప్రాజెక్టు ఉండాలని అప్పడి జవహర్‌లాల్ నెహ్రూ పాలసీ. హైదరాబాద్ రాష్ట్రానికి పోచంపాడు పెద్ద ప్రాజెక్టు. కానీ సీమాంవూధతో కలవగానే నాగార్జునసాగర్‌ను పెద్ద ప్రాజెక్టు చేసి పోచంపాడును రహస్యంగా చంపేశారు. తగ్గించారు. నిధులు ఇవ్వక ఏడిపించారు. నీళ్లు రాకుండా పక్క రాష్ట్రాలు చేసే ప్రయత్నాలను పోతే పోనీ అని ప్రతిఘటించకుండా తెలంగాణకు అన్యాయాలు చేశారు. నాగార్జునసాగర్ లోనైనా తెలంగాణకు న్యాయం జరిగిందా అంటే అదీ లేదు. తెలంగాణ జిల్లాల్లో పారే కాలువల నిర్మాణం కావాలని ఆలస్యం చేశారు. ముందు కోస్తాలో, డెల్టాలో మూడు పంటలకు ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణలో ఒక్క పంటకు కూడా నీరివ్వని దుర్మార్గం దశాబ్దాల పాటు కొనసాగించారు.
 
దీని గురించి మాట్లాడమంటే కుహనా మేధావులు కొందరు నీరు పల్లమెరుగు అని తెలియదా? తెలంగాణ ఎత్తుగడ్డ అందుకే నీళ్లు మీకు రావు అని హేళనగా నవ్వుతూ వాదిస్తారు. మరి కృష్ణా గోదావరి నదులు ఇతర నదులు తెలంగాణ నుంచే ఎందుకు పారుతున్నాయి? నదులు పారుతున్న ప్రాంతాల్లో పక్కనున్న పొలాలకు నీరివ్వడానికి ఏ ఎత్తుగడ్డ అడ్డు వచ్చింది? ఒకవేళ నీరు పల్లమెరుగు అని నీళ్లన్నీ వదిలేస్తే సమువూదంలో కలిసి పోవలసిందే కదా, మరి ఆనకట్టలు ఎందుకు కడుతున్నారు? ఒకవేళ కోస్తాంధ్ర పల్లంలో ఉండి నీటికి కొదవలేకపోతే, తెలంగాణ వస్తే మా జిల్లాలలకు నీళ్లు రానేరావనే వాదం ఎక్కడనించి పుట్టింది? ఇంజినీర్లు, రాజకీయ నాయకులు మేధావులనబడే వారు పక్కనున్న ప్రాంతానికి ఇంత ద్రోహం చేయడం, తరువాత అంతా సమైక్యం కలిసి ఉండాలని ఉత్త ఖాళీ నీతి బోధలు చేయడం ఎవరూ ఊహించలేరు. మరొక మేధావి అతను పార్టీ నాయకుడో, ఎన్జీవోనో లేక మరేదో ఆయనకే తెలియదు. మాజీ పరిపాలనాధికారినరి చెపుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాం గ సమాఖ్య లక్షణానికి వ్యతిరేకమని తప్పుడు వ్యాఖ్యానా లు చేస్తుంటాడు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల తీవ్రంగా నష్టపోయేది సీమాంధ్ర అని చెప్పుకుంటున్నారు. అంటే ఏమిటి? అక్రమంగా ఇన్నాళ్లూ చేసుకుంటున్న లాభాలు రావనా? లేక న్యాయంగా వారికి రావలసింది రాకుండా పోతుందనా? న్యాయంగా తమకు వచ్చేది ఇది రాకుండా పోయేది ఇది అని ఇంతవరకు ఒక్క సీమాంధ్ర నిపుణుడు కూడా చెప్పలేకపోయాడు. ఎందుకంటే పోయేదేమీ లేదు కనుక. హైదరాబాద్ లేకుండాపోయిందన్న దుగ్ధ తప్ప.

దాదాపు అక్రమంగా వంద టీఎంసీ జలాలను తరలించుకుపోవడానికి సీమాంధ్ర ముఖ్యమంవూతులు,నోరుమూసుకున్న తెలంగాణ సేద్యపు నీటి మంత్రులు, సీమాంధ్ర పక్షపాత, తెలంగాణ వ్యతిరేక ఇంజినీర్లు, వారికి సాయం చేసే ఇతర ప్రభుత్వోద్యోగులు చేసిన అక్రమాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నిలిచిపోతాయి. దీన్ని నష్టమనీ అందుకు నష్టపరిహారం ఇవ్వాలని ఎవరూ అడగడానికి వీలుండదు. నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలి కాని నష్టం చేసిన వారికి కాదు.

తెలంగాణను ఆంధ్రతో కలిపి ఆంధ్రవూపదేశ్‌ను ఏర్పాటు చేశాక గత 57 ఏళ్లలో సీమాంధులు కేవలం బడ్జెట్ కేటాయింపులు, తెలంగాణ భూముల అమ్మకం ద్వారా ఈ ప్రాం తాన్ని దోచుకున్న సంపదే నాలుగున్నర లక్షల కోట్లు ఉంటుందని కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)కు టీఆర్‌ఎస్ సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. 1956 నుంచి ఇప్పటి వరకు సీమాంధ్ర పాలకుల తప్పుడు పరిపాలన, కావాలని సాగించిన నిధులు నీళ్ల మళ్లింపు కారణంగా తెలంగాణలో ఇరిగేషన్, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడి రూ.4.53లక్షల కోట్లు ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆ నివేదికలో తెలిపారు. గోదావరి, కృష్ణా నదులపై కొత్తగా నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించి జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాల్సిన అవసరం ఉందని కూడా ఈ నివేదిక గుర్తు చేసింది. కృష్ణా, గోదావరి బేసిన్‌ల ద్వారా రాజ్యంగబద్ధంగా, బచావత్ ట్రిబ్యూనల్ కేటాయింపుల ప్రకారం నీటి పంపకాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను కేటాయించాలి. తాగు నీటిని సాగునీటిని పంచడంలో తెలంగాణకు విశాలాంవూధలో అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఫజల్ కమిషన్ కూడా హెచ్చరించింది. తెలంగాణలో కృష్ణా గోదావరి నదులపై ప్రాజెక్టులు నిర్మించాలన్న సూచనను పాటించకపోగా ఉన్న ప్రాజెక్టులకు నీరందకుండా తరలించుకుపోయారు. సమైక్యపాలనలో నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగు చేస్తున్న లక్షలాది చెరువులను నాశనం చేశారు.1976లో ఏర్పాటైన బచావత్ ట్రిబ్యూనల్ కూడా కృష్ణానది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని గుర్తించింది. కృష్ణాలో తెలంగాణకు కేటాయించిన 298 టీఎంసీలు, గోదావరిలో కేటాయించిన 900 టీ ఎంసీ జలాలు అందకుండా కుట్రలు చేశారు. తమకు కేటాయించిన నీటికన్నా అదనంగా నదుల నీటిని సీమాంవూధకు తరలించుకుపోయారు.

తెలంగాణ తీవ్రంగా నష్టపోయిన మరో రంగం ప్రభుత్యోద్యోగాలరంగం. ప్రభుత్వవిభాగాలలోని నియామకాలలో తెలంగాణకు జనాభా ప్రాతిపదికన ఉద్యోగాలు లభించలేదు. విశాలాంధ్ర ఏర్పడగానే మొదట పథకం ప్రకారం సీమాంధ్ర పాలకులు చేసిన దుర్మార్గం ఏమంటే తెలంగాణ ఉద్యోగులను ఏదో ఒక అర్హతను అనర్హతల సాకు చూపు తూ పక్కకుబెట్టి తమకు అనుకూలురైన పక్షపాతంతో కూడిన వారిని ఎంచుకొన్నారు, ఒక్కొక్క ఉద్యోగి తమ జిల్లాల నుంచి వందల మందిని తరలించి తమ వలస బలాన్ని పెంచుకున్నారు. కొన్ని రంగాలలో దీని ఫలితంగా 48 శాతం ఉండవలసిన తెలంగాణ ఉద్యోగుల సంఖ్య కనీసం 25శాతం మించలేదు. తెలంగాణ ఉద్యోగులలో 30 శాతం మంది వారు సీమాంవూధులే ఉన్నారు, వీరు తెలంగాణకు భారమే కాకుండా, తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా ఈ ప్రాంతం వారికి ఉద్యోగాలు రాని పరిస్థితి వస్తుంది. సేద్యపు నీటి అన్యాయాలతో పాటు ఉద్యోగుల విషయంలో తెలంగాణ సాగిన అన్యాయాలకు వ్యతిరేకంగా 1969లో ఉద్యమం వచ్చింది. ముల్కీ నియమాలను సుప్రీంకోర్టు సమర్థించినా సీమాంధ్ర లాబీయింగ్ శక్తికి తుంగలో తొక్కారు. మొత్తం రెండున్నర లక్షల కుటుంబాలు ఉద్యోగాలు కోల్పోయాయని ఈ నివేదికలో అంచనా వేశారు. కేవలం 27 శాతం తెలంగాణ వారే ఉద్యోగాల్లో ఉన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే పెన్షనర్ల భారం 2072 కోట్లు ఉంటుంది వీరిలో అత్యధికులు సీమాంధ్ర వారే. వీరిని ప్రాంతీయవారీగా గుర్తించి వారి బాధ్యతను ఆయా ప్రాంతాలకు అప్పగించాలి.

విభిన్న ప్రభుత్వ ఉద్యోగరంగాలలో తెలంగాణ వారి సంఖ్య చాలా తక్కువగా ఉండడమే ఈ ఉద్యమానికి కారణం కనుక, ఇప్పుడున్న ఉద్యోగులను 52: 48 నిష్పత్తితో విభజిస్తే తెలంగాణలో 25 శాతం మంది ఆంధ్రా ఉద్యోగులు పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది. వీరు ఉన్నత స్థాయిలో ఉంటే వారికింద ఉండే తెలంగాణ ఉద్యోగులను కక్షగట్టి నాశనం చేస్తారు, ఈ పరిస్థితి న్యాయశాఖలో విపరీతంగా ఉంది. తెలంగాణ కేడర్ న్యాయాధికారులు. ఇటీవల హైకోర్టు జడ్జి నియామకాలు కూడా తెలంగాణకు అన్యాయాన్ని ప్రతిబింబిస్తున్న విష యం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జిల్లా స్థాయి న్యాయస్థానాలలో తెలంగాణ వారి సంఖ్య 25శాతం కూడా ఉండబోదని ఒక అంచనా. 52: 48 నిష్పత్తిలో కనుక ఉద్యోగుల పంపిణీ జరిగితే అది అన్యాయాల కొనసాగింపు అవుతుంది. కొత్తగా నియామకాలు జరిపేందు కు అనుమతించబోమనే సూత్రాన్ని సడలించి తెలంగాణ ఉద్యోగులకు ప్రత్యేక అవకాశాలు ఇవ్వవలసిన ఉంటుం ది. ఆంధ్రా కేడర్ వారిని ఆంధ్రాకు పంపించి, తెలంగాణ వారిని నియమించేందుకు అనుమతించకపోతే అంతులేని అన్యాయాలు తెలంగాణ వచ్చిన తరువాత కూడా తెలంగాణ న్యాయస్థానాల ద్వారా జరుగుతాయి.

హైకోర్టులు రెండు ఏర్పడాల్సిందే. లేకపోతే తెలంగాణ హైకోర్టు రూపుదిద్దుకునే అవకాశమే ఉండదు. నిజానికి శ్రీకాకుళం, చిత్తూరు వంటి జిల్లాల ప్రజలకు న్యాయం కోసం హైదరాబాద్‌కు రావడమే ఒక తీవ్రమైన అన్యా యం, అసాధ్యమైన విషయం. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా హైదరాబాద్‌కే రావలసిన పరిస్థితిని కొనసాగించకపోవడం వల్లనే వారిని న్యాయం కలుగుతుంది. వారి కోసం విశాఖలో, గుంటూరులో, కర్నూలులో హైకో ర్టు బెంచీలు ఉండాలని ఇదివరకు నుంచే డిమాండ్ ఉంది. కాని పట్టించుకున్నవారే లేరు. ఇప్పడికైనా రాజధాని నగరం ఏదైనా ఒకటి రెండు ధర్మాసనాలను ఏర్పాటు చేయ డం అవసరం. కేసుల వ్యాపారం చేసే వారికి ఈ ఏర్పాటు నచ్చదు. బ్రోకర్ల లాబీయింగ్ బలంగానే ఉంటుంది. వారి ప్రయోజనాలకన్నా, న్యాయార్థుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటే ముందుగా హైకోర్టు విభజన జరిగితే సీమాంవూధకు ఇటు తెలంగాణకు న్యాయం జరుగుతుంది.

విభజన తరువాత తెలంగాణకు స్థానిక అధికారులు కోటాలో కనీసం 60 మంది ఉండాలి. అంటే ఇంకా 50 శాతం మందికన్నా తక్కువగా ఉన్నారు. ఐఏఎస్ అధికారు ల్లో రాష్ట్రానికి 376 మందిని కేటాయిస్తే ఇందులో తెలంగాణ వాటా ప్రకారం తెలంగా ణ క్యాడర్‌కు 160 నుంచి 170 మంది ఉండాలి. కానీ 27 మంది మాత్రమే ఉన్నారు. రాష్ట్రానికి కేటాయించిన 258 మంది ఐపీఎస్‌లలో తెలంగాణ కేడర్‌కు 20 మంది మాత్రమే ఉన్నారు. 149 మంది ఐఎఫ్‌ఎస్‌లలో 15 మంది మాత్రమే తెలంగాణ క్యాడ ర్ వారున్నారు. అఖిల భారత సర్వీస్ రూల్స్‌ను మార్చి ఇన్‌సైడర్ కోటా ద్వారా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణకు జరిగిన తీవ్రమైన నష్టాలను పూరించడం సాధ్యం కాదు. అట్లా అని పరిహారం ఇవ్వబోమనడం న్యాయం కాదు. ఇకనైనా నష్టాలు జరగకుండా కాపాడుకోవాలి. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా తెలంగాణ అన్యాయాలు కొనసాగితే తెలంగాణ నాయకులను ఈ ప్రాంత ప్రజలు క్షమించరు.
 
పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని ప్రకటించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి పూర్తిగా యూ టర్న్ తీసుకున్నారు. రాష్ట్రపతికి ప్రధానికి లేఖ రాస్తూ రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, సీమాం ధ్ర సమస్యలను పరిష్కరించకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం న్యాయం కాదని విమర్శించారు. ఆ ఉత్తరాన్ని రాష్ట్రపతి, ప్రధానికి పంపగానే తెలంగాణ ప్రక్రియ ఆగిపోతుందని తెలంగాణ వ్యతిరేక మీడియా ప్రచారం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏరా ్పటు అయ్యే దాకా ఈ ప్రచారాలు నిజమో కాదో తెలియదు.

ఆర్టికల్-3 ప్రకారం కేవలం రాష్ట్రశాసనసభ అభివూపాయం కోసం మాత్రమే పునర్విభజన బిల్లును పంపాలి. గడువు తీరిన వెంటనే శాసనసభ అభివూపాయం ఏదైనా సరే రాష్ట్రపతి బిల్లును ఆమోదించాలని పార్లమెంటును కోరవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంటు ఆమోదిస్తేనే తెలంగాణ ఏర్పడుతుంది. అసెంబ్లీ తీర్మానం చేయడం ద్వారా కొత్త రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రక్రియ మొదలు పెట్టడం జరిగితే జరగవచ్చు. కాని అది రాజ్యాంగ అవసరం కాదు.

సంప్రదాయాలను పాటించడం లేదనే విమర్శకు అర్థం లేదు. రాజ్యాంగ నియమాలు స్పష్టంగా లేనపుడు సంప్రదాయాలు తయారవుతాయి. ఆచారాలు సంప్రదాయాలు స్పష్టమైన శాసనాలను రాజ్యాంగాన్ని అధిగమించవు. రాష్ట్ర విభజనకు ముందు మెజారిటీ ప్రజల సమస్యల ను అర్థం చేసుకోవాలని సీఎం కోరారు. నిరంతరం మైనారిటీగా ఉన్న తెలంగాణ ప్రజలకు సమస్య మొదటి నుంచీ మెజారిటీ సీమాంధ్రదే. దానికి పరిష్కారం రాష్ట్ర విభజ న మాత్రమేనని ఉద్యమం సాగింది. విభజన పరిష్కారం, సమస్య కాదు. ఒక సమస్యకు పరిష్కారం బదులు మరి న్ని సమస్యలు సృష్టించారనే వాదాన్ని వినిపిస్తున్న వారు కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు, వెంకయ్య నాయుడు, జయవూపకాశ్ నారాయణ్. రాష్ట్రాన్ని విభజించడాన్నే వ్యతిరేకించే వారి సమస్యలను ఏవిధంగా పరిష్కరించాలో వా రు చెప్పరు. ఎవరినీ సంప్రదించలేదని, తొందరపడ్డారని కూడా సీఎం నిందించారు. డిసెంబర్ 9కి ముందు ప్రతి పార్టీ ప్రతినిధిని సంప్రదించారు. అందరూ తెలంగాణను సమర్థించారు. ‘నిర్ణయించండి సమర్థిస్తాం’ అని చంద్రబాబు కూడా ప్రకటించారు. కిరణ్ కుమార్‌రెడ్డి యూ టర్న్ తీసుకున్న వారిలో చేరడం కొత్త వార్త.

కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రానికి ఉన్న రాజధానిని ఇవ్వ డం ఇదివరకెన్నడూ జరగలేదు కనుక ఇవ్వకూడదని సీఎం వాదిస్తున్నారు. ఇందులో రెండు అవాస్తవాలు ఉన్నాయి. ఒకటి-తెలంగాణ కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రం కాదు. 1956కు ముందే హైదరాబాద్ పేరుతో ఉన్న రాష్ట్రం. రెండు- ఆ రాష్ట్రంలో అప్పడికే హైదరాబాద్ రాజధానిగా భాసిల్లుతున్నది. తెలంగాణకు రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను తెలంగాణకే ఇవ్వడంలో అపూర్వ ఘటనేమీ కాదు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత హైదరాబాద్ రాజధాని అయిందనడానికి వీల్లేదు. సీమాంధ్ర విడిగా నిర్మించుకున్న రాజధానిని తెలంగాణకు ఇమ్మని అడగడం లేదు, ఇవ్వడం లేదు. అందరికీ తెలిసిన ఈ ప్రాథమిక వాస్తవాన్ని ముఖ్యమంత్రి మరో రకంగా చెప్పడం న్యాయం కాదు.

ఆంటోనీ కమిటీ నివేదిక రాకముందే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడం సరి కాదని ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు. ఆ నివేదిక వచ్చిందో లేదో ముఖ్యమంవూతి కి తెలిసి ఉండాలి. ఆ కమిటీ ముందుకు వచ్చిన అంశాలను సమస్యలను ఆందోళనలను మంత్రివర్గ కమిటీ పరిశీలిస్తుందని పదేపదే ప్రకటించారు.‘తెలంగాణ విషయాన్ని ఐటెమ్‌గా పరిగణించడం సమస్య తీవ్రతను గుర్తించకపోవడమే’ అని ముఖ్యమంత్రి అంటున్నారు! సమస్య తీవ్రతను గుర్తించడం ప్రధానంగానీ పేర్లతో రూపాలతో పనేమిటి? నానాటికి రగులుతున్న ఈ సమస్యను ఏదో ఒక రకంగా తీర్చండి అని అనేకసార్లు ఆయనే ప్రకటించారు. తీరా తీర్చిన తరువాత తీవ్రతను గుర్తించలేదని, ఆలస్యం అయిందని విమర్శించినవారే తొందరపడుతున్నారని అనడం విచి త్రం. కనీసం ఒక పుష్కరం నుంచి తెలంగాణ సమస్య సాగుతున్న విషయం ముఖ్యమంవూతికి తెలుసు. 2009 డిసెంబర్9 నాటికి తెలంగాణ ఏర్పాటు అనే పరిష్కారాన్ని కేంద్రం ఒక ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నదని అధిష్ఠానవర్గం ఆంతరంగికుడైన ముఖ్యమంవూతికి తెలియదా? తెలంగాణ పట్ల జరిగిన అన్యాయాలకు పరిష్కారం రాష్ట్ర విభజన అని నిర్ణయించిన అధిష్ఠానవర్గం పట్ల న్యాయంగా సమంజసంగా ఉన్నారా అని ఆలోచించుకోవలసింది ముఖ్యమంవూతిగారే.

సీఎం తెలంగాణ వ్యతిరేక దాడులు ఈ విధంగా ఉంటే.., వైఎస్‌ఆర్ సీపీ నాయకు డు, అనేక 420 కేసులలో నిందితుడు. నిన్న మొన్న బెయిల్‌పై విడుదలైన జగన్మోహ న్ రెడ్డి ఇన్నాళ్లూ తాను తన తండ్రిగారూ సేవించి తరించిన సోనియాగాంధీపైనే విరుచుకుపడ్డారు. ఇంతవరకూ ఎవరికీ రాని కొత్త ఆలోచన ఈ యువ నేతకు వచ్చింది. 30 ఏళ్ల పాటు భారతదేశంలో ఉన్న సోనియాకు ఉన్న పౌరసత్వం రద్దుచేసి ఇటలీకి పొమ్మంటే వెళ్లిపోతారా? అటువంటిది అరవై సంవత్సరాల పాటు హైదరాబాద్ లో ఉన్న వారు ఏ విధంగా వదిలిపోగలరు? అని చాలా గొప్పగా ప్రశ్నించారు. జగన్‌కు రెండు మౌలిక విషయాలు చెప్పిన వారెవరూ లేక ఈ విధంగా మాట్లాడి ఉంటారు. ఒకటి సోనియా గాంధీ ఇటలీలో పుట్టినా రాజీవ్ గాంధీని వివాహం చేసుకోవడం నిర్ణీతకాలం దేశంలో నివసించడం,రాజ్యాంగం ఏడో షెడ్యూలులో పేర్కొన్న భాషల లో ఒక్క భాషలోనైనా మాట్లాడే సామర్థ్యం సాధిస్తే పౌరసత్వం వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా సోనియా గాంధీకి పౌరసత్వాన్ని ఇచ్చారు. ఆమె ఓటరుగా నమోదైనారు.

వేరే దేశాల పౌరసత్వం తీసుకున్నపుడు వెంటనే భారత పౌరసత్వం రద్దవుతుంది. అదొక్కటే నిబంధన. ఆ పరిస్థితి లేనపుడు ఆ పౌరసత్వాన్ని రద్దు చేయడానికి ఇప్పటి చట్టాల ప్రకారం వీల్లేదు. జగన్‌కు చెప్పేవారు సరిగా ఉండాలి. తానే నేరస్తుడిని కాదని నిరూపించుకోవలసిన పరిస్థితుల్లో ఉన్నారాయన. పౌరసత్వం చట్టాన్ని సవరించి ఆమె పౌరసత్వం రద్దు చేయడానికి చట్టం చేసినా అది వెనుక తేదీనుంచి అమలు చేయడం సాధ్యం కాదు. అది చట్ట విరుద్ధమవుతుంది, రాజ్యాంగ వ్యతిరేకమూ అవుతుంది. జగన్ ఇష్ట్ర పకారం పౌరసత్వాలు రద్దు చేయడం సాధ్యం కాదు. పౌరసత్వాలకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏమాత్రం సంబంధం లేదు. ఆంధ్రవూపదేశ్ నుంచి విడిపోయినంత మాత్రాన తెలంగాణ దేశంలో అంతర్భాగం కాకుండా పోతుందా? పోతుందని జగన్‌కు ఎవరైనా చెప్పారా? జగన్ లోటస్ పాండ్‌ను వదిలేసి వెళ్లమని ఎవరైనా అంటారా?

సీమాంవూధలో బలపడాలంటే తెలంగాణను కేసీఆర్‌ను ఎంత బలంగా తిడితే అంత గా సీమాంవూధలో జనం జగన్‌కు, కిరణ్‌కు, చంద్రబాబుకు రాజకీయ సమర్థన లభిస్తుందని వారి నమ్మకం. తెలంగాణను వ్యతిరేకించడంలో కూడా ప్రయోజనాలున్నాయని సీమాంధ్ర రాజకీయనాయకులకు తెలుసు. తెలియాల్సిం ది ప్రజలకే. తెలంగాణను సీమాంవూధతో విలీ నం చేయ డం వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. గుర్తింపును, సంస్కృతిని, సాహిత్యాన్ని నిలబెట్టుకోవడం, తన చరిత్ర నలిగిపోకుండా కాపాడుకోవడం కోసం పోరాటం సాగిం ది. దీన్ని సెంటిమెంట్ అనీ, ఆవేశం అనీ ఆలోచన అనీ అనవచ్చు. సెంటిమెంట్ అని తోసి పారేయడం మామూ లే, కాని ఆ సెంటిమెంటుకు ఒక పునాది ఉంది. చరిత్ర ఉంది. అరవై ఏళ్ళ పోరాటం ఉంది.

ప్రభుత్వం, సిబ్బంది, పోలీసులు చేతులు చాచి రారమ్మని ఆత్మీయంగా సభలకు ఆహ్వానించడంతెలంగాణ పోరాటాలకు లేదు. పాపం అటువంటి ఆర్జిత సేవలకు, సమర్పిత ఆందోళనలకు, ప్రోత్సాహిత ఉద్యమాలకు, సర్కారీ వారి పోషణకు తెలంగాణ వారు మొదటినుంచి దూరమే. అరెస్టులు లేని, ప్రతిఘటన ఉండని, గాయా లు, హక్కుల ఉల్లంఘనలు లేని ఉద్యమం కనిపించదు. నాటకీయ సానుకూల సామూహిక సహకార ప్రదర్శనలు తెలంగాణ ఉద్యమాల్లో కనిపించవు. తెలంగాణ నాయకుల మీద ప్రభుత్వ దమన నీతిమీద, వనరుల మళ్లింపు విధానాల మీద నిరంతరం పోరాడింది. తెలంగాణ ఏర్పాటుతో నైనా నెత్తుటి పోరాటాలు చేసే దశ సమసిపోతుందని ఆశించాలి. హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం చూస్తే మన రాష్ట్రంలో ప్రజాభివూపాయ ప్రకటనకు ఎంత స్వేచ్ఛ ఉందో అనిపిస్తుంది. అయితే ఒక్కటే షరతు.. జై తెలంగాణ అనకూడదు.

విచివూతమేమంటే ఒకవైపు ముఖ్యమంత్రి, మెజారిటీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మరో వైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, మధ్యలో సీమాంవూధకు తానే కాబోయే ముఖ్యమంవూతిననే ఆత్మవిశ్వాసంతో భారీ జన సభ నిర్వహించిన వైఎస్‌ఆర్ సీపీ నేత ముగ్గురూ మూడు దారుల్లో పయనిస్తూ తెలంగాణ వ్యతిరేకతలో సమైక్యమై సాగుతున్నారు. తనకు వ్యతిరేకంగా టీడీపీ-కాంగ్రెస్ ముఠా కట్టాయంటారు వైఎస్ జగన్, జగన్‌కు కాంగ్రెస్‌కు మధ్య రహస్య ఒప్పందమేదో ఉందంటారు చంద్రబాబు. తెలంగాణ వ్యతిరేకతలో ముగ్గురూ ఒక్కటే.

పది జిల్లాల జనం రాకపోయినా ఫరవాలేదు. 13 జిల్లాల ఆధిక్యతే సమైక్యతా ప్రదర్శన అని కిరణ్, చంద్రబాబు,జగన్, జేపీ నమ్ముతున్నారా? ఏ ఒక్కరూ తెలంగాణ పది జిల్లాలు లేకుండా సమైక్యతేమిటనే ప్రాథమిక ప్రశ్న అడగరు. వారు చెప్పరు. చదువులు , పదవులు, ఆచార్య పీఠాలు కూడా ఈ ప్రాథమిక సందేహాన్ని లేవనెత్తకపోవడం అర్థం కాని వింత నాగరికత. నిజానిజాలు గమనించ వలసింది ప్రజలు. నాయకుల మాటలను నమ్మాలో లేదో తేల్చుకోవలసింది ప్రజ. ముఖ్యంగా సీమాంవూధలో బలం పెంచుకోవడానికి కూడా తెలంగాణ తన వ్యతిరేకులకు ఉపయోగ పడుతున్నది. దూషణ విధానంలోనైనా సరే తెలంగాణను నమ్మిన వారికి తెలంగాణ అన్యాయం చేయదు.
-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు

Thursday, April 3, 2014


(Source-Namasthe Telangana)